Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
క్రమశిక్షణ నియామవళీ నిబంధనలను ఉల్లంఘించిన గ్యార నరేష్, గొలి హరికష్ణ, ఉప్పుల ఉదరు కుమార్, కాంపల్లి శ్రీనివాస్, హారిష్ ఆజాద్, సత్యా, సాయి, రవి కిరణ్, వినరు కుమార్, రాజులను ఏఐఎస్ఎఫ్ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు యన్ అశోక్ స్టాలిన్, రావి. శివరామకష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ ఎన్ శంకర్, రాష్ట్ర యూనివర్సిటీల కన్వీనర్ డి.రాము, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్, రెహమాన్ తెలిపారు. సోమవారం ఓయూ విశ్రాంతి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారు మాట్లాడుతూ గతం నుంచి ఉన్న ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సుమేర్ పాషా, క్రాంతి రాజ్ లతో కూడిన ఓయూ కమీటీని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ గుర్తిస్తోందని అన్నారు. దానిని కాదని ఏఐఎస్ఎఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా పైనా పేర్కొన్న వాళ్ళు వేరే కమిటీ ప్రకటించడం ఇది ఏఐఎస్ఎఫ్ సంఘ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. సంఘ క్రమశిక్షణ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిని ఏఐఎస్ఎఫ్ నుంచి బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. ఈవిషయాన్ని యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఇతర విద్యార్థి సంఘాలు గమనించాలని కోరారు.