Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
నిరుద్యోగి ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని ఓయూ జేఏసీ, బహుజన విద్యార్థి సంఘాలు టీఆర్ఎస్ సర్కార్పై మండిపడ్డాయి. నిరుద్యోగి మహేశ్ ఆత్మహత్యకు నిరసనగా సోమవారం ఓయూ
ఎన్సీసీ గేట్ వద్ద రాస్తారోకో చేపట్టి టీఆర్ఎస్ సర్కార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బేరు చెలుక గ్రామానికి చెందిన మహేశ్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతో, కుటుంబానికి భారం కాలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే చెప్పారు. నిరుద్యోగులు ఎవరు నిరాశకు లోను కావద్దు, ఎవరు ఆత్మహత్యలకు పాల్పడరాదని ఓయూ జేఏసీ విజ్ఞప్తి చేస్తుందని హితబోధ చేశారు. ప్రభుత్వం మెడలు వంచి నోటిఫికేషన్లు వచ్చేటట్లు కొట్లాడుదాం అని బహుజన విద్యార్తి సంఘాల నాయకులు వేల్పుల సంజరు, నవతెలంగాణ స్టూడెంట్ యూనిటీ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ చైర్మెన్ కొత్తపల్లి తిరుపతి, సాంబాగౌడ్, పులిగంటి వేణుగోపాల్, కుమార్, అంజి, మహేష్, రాము, భాస్కర్, జయశంకర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్, బహుజన స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చింత కిరణ్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు ధర్మపురి శంకర్, ఆంజనేయులు ముదిరాజ్, సందీప్, మహేష్, స్వామి, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.