Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
కుల్సుంపుర హైస్కూల్ 1991 బి 92వ బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు గెట్ టూ గెదర్ జరుపుకున్నారు. మెహిదీపట్నంలోని ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన నక్క మల్లికార్జున్, ధర్మేందర్, నాగరాజ్, రమేష్, నాగేష్, మహేష్, స్వామి, సంతోష్తో పాటు 30 మంది పాల్గొని గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు తరచుగా నిర్వహించుకోవాలని, ఇవి జీవితాలకు కొత్త ఉత్తేజాన్ని, నూతన ఉత్సాహాన్ని ఇస్తాయని వారు అభిప్రాయపడ్డారు.