Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పర్యావరణాన్ని కాపాడుకుందాం
డాక్టర్ జయసూర్య
నవతెలంగాణ-ముషీరాబాద్
సాంప్రదాయకంగా దీపాలతోనే దీపావళి జరుపుకుందాం అని డాక్టర్ జయసూర్య పిలుపునిచ్చారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహనా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. 50 ఏండ్లకు పైగా సాంప్రదాయబద్దకంగా, మతాలకు అతీతంగా దీపాలతోనే దీపావళి జరుపుకుంటున్నామని అన్నారు. టాపసులు మధ్య వచ్చాయని, వీటిని మధ్యలో వదిలేద్దామని అన్నారు. రకరకాల కాలుష్యాల వల్ల విడుదలయ్యే అతిసూక్ష్మ ధూళికణాలు గాలిలో తేలియాడుతూ ఉంటాయని, వాటికి కరోనా అతుక్కుపోయి శ్వాసకోశాలలోకి చేరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారని చెప్పారు. పటాకులలో వాడే రసాయనాలు చాలా ప్రమాదకరమైనవని, సీసం , పొటాషియం , క్రోమియం , సల్ఫర్ డై ఆక్సైడ్ , నైట్రోజన్ డై ఆక్సైడ్ , కార్బన్ మోనాక్సైడ్ , మెగ్నీషియం లాంటి అనేక రసాయనాలు నాడీ వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయని పేర్కొన్నారు. మెదడు సంబంధిత వ్యాధులకు, ఊపిరితిత్తులకు , చర్మవ్యాధులకు , హైపర్ సెన్సిటివిటీ , క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందని అన్నారు. విషవాయువుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని , వద్ధులకు, చిన్నపిల్లలకు ప్రాణాంతకంగా మారే అవకాశాలు చాలా ఉంటాయని అన్నారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి గారు మాట్లాడుతూ దేశంలో ఢిల్లీ , ముంబాయి లాంటి అనేక నగరాలలో కాలుష్యం బాగా పెరిగిందని, కాలుష్యం మానవ మనుగడకు ముప్పు కలిగిస్తున్నదని అన్నారు. ఈ తరుణంలో పండుగలన్నీ పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరారు. ప్రభుత్వాలు కూడా కాలుష్యంతో కూడిన పటాసులను ఉత్పత్తి చేయనియవద్దు, వాటి అమ్మకాలను కూడా నిషేదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వీరయ్య, ఉపాధ్యక్షులు మల్లం రమేష్, పి . నాగేశ్వర్రావు, సహయ కార్యదర్శులు పి . మోహన్, పి.శ్రీనివాస్ రావు, నర్సింగ్ రావు, జేకే శ్రీనివాస్, నాయకులు మిమిక్రి నరేష్, హస్మీత, భవాణి, మాణిక్యం, రమేష్, రాములు, గోపాల్ పాల్గొన్నారు.