Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఆనంద్బాగ్లో 100 ఫీట్ రోడ్డులో ఆర్యూబీ వద్ద ప్రభుత్వ భూమి కబ్జా నుంచి కాపాడాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ముదిరాజ్ అన్నారు. సోమవారం కార్పొరేటర్ శ్రావణ్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనంద్బాగ్ 100 ఫీట్ రోడ్డులో ఆర్యూబీ సర్వే నెంబర్ 24లోగ్రామ పంచాయతీ అఫ్రూవల్ లే అవుట్లో 1800 గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారనీ, ఈ భూమిలో 25 ఫీట్ల రోడ్డు, ఒక పార్కు, వాటర్ వర్క్, భూమి 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న కొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై గతంలో జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేశామనీ, ధర్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా అన్యాక్రాంతమైన భూమిని ప్రజా అవసరాలకు వినియోగించాలనీ, ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలలనీ, లేని యెడల ప్రభుత్వ భూమిని రక్షించాలని అధికారులు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, సదానంద్గౌడ్, సోమశ్రీనివాస్, బాలచందర్గౌడ్, ఆనంద్గౌడ్, గణేషన్ ప్రకాష్, రాకేష్, భరత్యాదవ్, సునీల్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.