Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్, సోల్ ట్రస్ట్ డీవైవెఫ్ఐ ఆథ్వర్యంలో కాప్రా ఏఎస్రావునగర్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ మీర్పేట్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. పేదలకు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. భవిష్యత్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 100 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు. ప్యూర్ సౌల్స్ ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మెన్ వరప్రసాద్, సెక్రెటరీ ఉదరుభాస్కర్, చందన్రాజు, అందలి దేవిరెడ్డి, లయన్స్ క్లబ్ నుంచి గణేష్, మనోజ్ యాదవ్, మొగిలి, ఏరియా బాధ్యులు వెంకట్, శ్రీమన్నారాయణ, విజయలక్ష్మి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్, సోయల్, శ్వేత, మౌనిక, ఝాన్సీ, జ్యోతి, లక్ష్మి పాల్గొన్నారు.