Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
ఆరోగ్యం బాగుంటే కుటుంబం సంతోషంగా ఉంటుందనీ, ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్ధ తీసుకోవాలని మేజర్ జనరల్ డాక్టర్ ఎంవికె మోహన్ అన్నారు. జవహర్నగర్ మున్సిపాలిటీలో మోహన్రావు కాలనీలో 15వ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మాజీ సైనికుడు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జన ఔషధి కేంద్రాల నిర్వాహకులు గోపురమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన స్కీం కింద ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను పెట్టి ప్రజలకు డబ్బుల భారం పడకుండా లక్షలాది కుటుంబాలను ఆదుకుంటున్నారని తెలిపారు. గోపురమణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికి 15 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించి లక్షలాది మందికి ఉపయోగపడే మందులను తక్కువ ధరలకే అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్లో ఇంకా మరిన్ని జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నామనీ, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బడుగు, బలహీన వర్గాల వారికి బ్రహ్మాండమైన వరం లాంటిదనీ, చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్ బింగి లావణ్య, సతీష్గౌడ్, కార్పొరేటర్ గండి రామచంద్ర, శ్రీకాంత్, డీకే సింగ్, యూఎన్ సింగ్, జీఎస్రావు, గోపు లక్ష్మి, విజయభాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.