Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
ఇంట్లో నంచి వెళ్లిపోయిన ఓ యువకుడు హుస్సేన్సాగర్లో శవమై తేలాడు. పోలీసుల వివరాల ప్రకారం ముషీరాబాద్ చేపల మార్కెట్ ప్రాంతానికి చెందిన నగేష్చారి కుమారుడు శ్రీధర్చారి (28) కార్పెంటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. కొద్ది రోజుల నుంచి పూర్తిగా డిప్రెషన్లో ఉంటూ ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదు. గత నెల 31వ తేదీన తన అన్న శ్రీకాంత్కు వాట్సప్లో మెసేజ్ చేశారు. ''నేను ఏ తప్పు చేయకున్నా తనపై నిందలు వేస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందరినీ మిస్ అవుతున్నా'' అని వాట్సప్ మెజేస్ చేశాడు. ఆ తర్వాత సోదరుడు ఫొన్ చేసినా స్పందించలేదు. దీంతో ఆయన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా సోమవారం ఉదయం శ్రీధర్చారి హుస్సేన్ సాగర్లో శవమై తేలాడు. రామ్ గోపాల్పేట్ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి అతని దగ్గర అన్న చిరునామా ఆధారంగా కుటుంబ పభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్గం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమాని స్తున్నారు. కేసును ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.