Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మున్సిపల్ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ లోని 13వ వార్డులో మున్సిపల్ నిధులు రూ.5 లక్షలతో అంతర్గత మురికి కాల్వ నిర్మాణ పనులను వైస్ చైర్మెన్ బండారు మల్లేష్ యాదవ్తో కలిసి చైర్మెన్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా మని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.