Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కొత్త కళాశాలలు ఏర్పాటు చేయడానికి చేతగాని ప్రభుత్వం మేడ్చలో 40 ఏండ్ల చరిత్ర గల ఐటీఐ కళాశాలను ఎందుకు తరలిస్తున్నారని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పడాల శంకర్ ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున్న ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలను పట్టణానికి దూరంగా వేరే స్థలానికి తరలిస్తామని ఇద్దరు మంత్రుల హస్తంతో ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ ఐటీఐ కళాశాలకు 40 ఏండ్ల ఉందనీ, 14 ఎకరాల భూమిపై మంత్రుల కన్ను పడిందన్నారు. బార్ కౌన్సిల్ కోసం ఇవ్వాలనే ప్రతిపాద వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ కోర్టు వెనుక పక్కలో అదనపు స్థలం ఉన్నా ఉపయోగించు కోవడం లేదనీ, ఐటీఐ కాలేజ్ పక్కనే ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ రెండెకరాల స్థలం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాల జోలికి వస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకత పొందిన ఐటీఐ కళాశాలలో మేడ్చల్ మొదటి స్థానంలో ఉందనీ, ఆ స్థలాన్ని ఎవరికి కేటాయించాల్సిన అవసరం లేదన్నారు. మంత్రుల స్వార్థం కోసం రూ.వందల కోట్లు విలువైన ఆస్తులను చదువుకునే ప్రభుత్వ విద్యా సంస్థలను బలి చేస్తామంటే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఐటీఐ కళాశాల సంరక్షణ కోసం ఎంతటి పోరాటా నికైనా సిద్ధమన్నారు. అనంతరం మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహ్మరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షుడు బ్యాగరి వెంకటేష్, ఉప్పల్ మండల అధ్యక్షురాలు చందన, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.