Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయిన్పల్లి కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్లో కంటోన్మెంట్ బోర్డు నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను సోమవారం కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి పరిశీలించారు. కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్ మర్రి లక్ష్మణ్రెడ్డి అసోసియేషన్ సభ్యులతో ప్లే గ్రౌండ్లో ఏర్పాటు చేయాల్సిన మైదానాల అంశంపై చర్చించారు. బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్, ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బోర్డు ఇంజినీర్ ఫణికుమార్ను ఆదేశించారు. క్రీడలకు సంబం ధించిన మున్సిపాలిటీ పరికరాల జాబితా అందించాలని అసోసియేషన్ సభ్యుల ను సీఈఓ కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు దేవేందర్, మహేందర్, అసోసియేషన్ సభ్యులు ప్రభుకుమార్గౌడ్, జగదీష్, సత్యనారాయణ, భరత్, జయరాజ్, తదితరులు పాల్గొన్నారు.