Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
రాష్ట్రంలో గడీల పాలన, ప్రగతి భవన్కు పరిమి తమైన కేసీఆర్ కుటుంబపాలనకు ప్రజలు చరమగీతం పాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. బాలమల్లేష్ అన్నారు. సోమవారం సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జి.సాయిలుగౌడ్ అధ్యక్షతన నీలం రాజశేఖర్రెడ్డి భవన్లో సోమవారం జరిగిన మేడ్చల్ జిల్లా సీపీఐ కౌన్సిల్ సమావేశంలో ఎన్.బాల మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా యన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం తెచ్చుకున్న స్వరాష్ట్రంలో కేసీఈర్ పాలన గడీలు, ప్రగతి భవన్కే పరిమితమైనదని విమర్శించారు. రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్నా రూ.లక్ష వేల కోట్ల అప్పులు చేశారన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా బీర్లు, బార్ల తెలంగాణగా మార్చేశారని విమర్శించారు. రాష్ట్రంలో లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయడం లేదన్నారు. మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలం బచేర చెలక గ్రామంలో సంపల్లి మహేష్ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూసి నోటిఫికేషన్ రాక ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు అద్ధం పడుతుందన్నారు. కేసీఆర్ ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిచి ఇస్తామనీ, దళితులకు మూడెకరాల భూమి, ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామనీ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.వెంకట్ రాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ అఫ్సర్, జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యులు జి.దామోదర్ రెడ్డి, రొయ్యల కృష్ణమూర్తి, ఉమామహేష్, శంకర్, జె.లక్ష్మీ యాదవ్, ప్రజా సంఘాల నేతలు ధర్మేంద్ర, సత్య ప్రసాద్, వెంకటాచారి, ప్రవీణ్, బి.కృష్ణ, సీపీఐ మండల కార్యదర్శులు రామ్ నారాయణ, పి.నర్సింహా, లొట్టి ఈశ్వర్, టి.యాదయ్య, కృష్ణ, పర్వీనా బేగం, శ్రీనివాస్, రచ్చ కిషన్, తదితరులు పాల్గొన్నారు.