Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
బంజారాహిల్స్ రోడ్ నెంబర్1లోని ఉప కేంద్రంలో బుధవారం విద్యుత్ వినియోగదారుల సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఏఈ కృష్ణ చైతన్య తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వివిధ సమస్యలపై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏడీ హైమనాంద్ తెలిపారు. బంజారాహిల్స్, వెంకటేశ్వర కాలనీ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ డివిజన్ల పరిధిలోని ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.