Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోల్కొండ సీఐ చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ-మెహదీపట్నం
గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రీసాలబజార్కు చెందిన ఏడాదిన్నర చిన్నారిపై లైంగికదాడి జరిగినట్లు వస్తున్న వార్తలను గోల్కొండ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. చిన్నారి ఒకటో తేదీ సాయంత్రం ఏడుస్తూ రాగా ఆమె లోదుస్తులపౖౖె ఉన్న రక్తపు మరకలను చూసి బాలిక నానమ్మ అనుమానించి మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఆ ఆరోపణలు నిరాధారమని తేలినట్లు తెలిపారు. సమీపంలోని సీసీ ఫుటేజీని పరీక్షించగా బాలిక ఒకటో తేదీ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తన ఇంటిముందు ఉన్న ద్విచక్ర వాహనంపైన ఆడుతుండగా అకస్మాత్తుగా కింద పడడంతో ఆమె ప్రయివేటు భాగాలకు గాయం కావడంతో రక్తస్రావం అయినట్లు తేలిందని వివరించారు.