Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
రెండేండ్లు మెడికల్ కోర్సు నీట్ 21-లో ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించిన సాధించినందుకుగాను మంగళవారం ఇనిస్టి ట్యూట్ మేనేజ్మెంట్ సంబురాలు నిర్వహించింది. మల్కాజిగిరికి చెందిన మణాల్ కుట్టేరి ర్యాంక్ సాధించడంతో తిరుమలగిరి శాఖలో బ్రాంచ్ హెడ్ దీపక్ కుమార్తులా, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ జెబి రావు, మాగంటి నర్సింగ్రావు, స్వర్ణ, గీతాంజలి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకున్నారు. తమ శాఖ విద్యార్థి ర్యాంకు సాధించడం తమకెంతో ఆనం దంగా ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.