Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్రెడ్డి , స్ట్రీట్ లైట్ రవీందర్, ప్రత్యుషతో కలిసి నెహ్రూనగర్లో జరుగుతున్న సెంటర్ లైటింగ్ పనులను పర్యవేక్షించారు. మల్లాపూర్ డివిజన్లోని నెహ్రూనగర్ నుంచి రూ.12 లక్షలతో మెయిన్ రోడ్డు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులకు కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరం చంద్రశేఖర్, మైనారిటీ అధ్యక్షుడు బాసిత్, ప్రకాష్, దుర్గయ్య, రాములు, రఘు, శ్రీకాంత్, మహేష్, మోహన్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.