Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్కు చెందిన టీఆర్ఎస్ నాయకులు ఎం.రీచర్డ్దాస్ పార్టీ మల్కాజిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్త్రృత ప్రచారం చేయాలన్నారు. మల్కాజిగిరి సర్కిల్లో టీఆర్ఎస్ను బోపేతం చేసేందుకు ఈ బాధ్యతలను అప్పగించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్టీకి తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతాననీ, మహిళలు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పార్టీ బలోపేతానికి తగిన కృషి చేస్తానని స్పష్టం చేశారు.