Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ డివిజన్ రాజీవ్ వీకర్ సెక్షన్లో రూ.10 లక్షలతో చేపట్టిన కమ్యూనిటీ హాల్కు మంగళవారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ డివిజన్లో అంచెలంచెలుగా అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కల్పిస్తున్నామనీ, ప్రతి కాలనీలో డ్రయినేజీ, సీసీ రోడ్డు, స్ట్రీట్ లైట్ వివిధ అభివృద్ధి కార్యక్ర మాలకు మీ ముందు ఉంటానని తెలిపారు. అనంతరం కాలనీవాసులు మౌలిక వసతులు కల్పించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిష నర్ నాగమణి, డీఈ మహేష్, సర్కిల్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి, ఆనంద్ ఉదరు కుమార్, బి.నాగేశ్వరరావు, లక్ష్మి కాంత్ రెడ్డి, సీవై రాజు, చెట్ల రవి వెంకటేష్గౌడ్, అక్రమ్ పాష, అఫ్జల్, ప్రవీణ్ కుమార్, మధు శ్రీనివాస్, మహిళలు జ్యోతి, కవిత, బబిత, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.