Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందిన తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ బాలుర విభాగ ప్రోగ్రాం అధికారి డాక్టర్ చింతల రాకేశ్ భవానిని కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగాల వాలంటీర్లు మంగళవారం సన్మానించారు. ఈ కార్యక్ర మానికి అధ్యక్షులుగా ఇన్చార్జి కళాశాల ప్రిన్సిపాల్ డా. ఫారూకీ, అధ్యాపక బృందం విచ్చేసి శుభాకాంక్షలు తెలియ జేస్తూ అభినందించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత చింతల రాకేశ్ భవాని మాట్లాడుతూ జాతీయ సేవా పథకం ద్వారా వాలంటీర్లతో సమాజ సేవలో పాల్గొనడం ఎంతో సంతృప్తిని కలిగించిందన్నారు. విద్యార్థి వాలంటీర్లు మాట్లాడుతూ చింతల రాకేశ్ భవాని తెలుగు అధ్యాప కులుగా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా, రంగారెడ్డి జిల్లా కోవిడ్ నోడల్ అధికారిగా కరోనా సమయంలో చేసిన సేవలను, జిల్లా నెహ్రూ యువ కేంద్ర సలహా సంఘ సభ్యుడిగా నిర్వహించిన కార్యక్రమాల పరంపరను వివరిస్తూ వారితో గల అనుబంధాన్ని నెమరువేసుకు న్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి వాలంటీర్లు మాల్యా ద్రి, రూపేశ్, వంశీరాజ్, గణేశ్, బాలు, అఖిల, హర్షిత, నిక్షిత, తదితరులు పాల్గొన్నారు.