Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తుందని రాష్ట్ర రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆల్పోజ్ డే ( ఆత్మల దినోత్సవం) సంద ర్బంగా సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బోయిగూడ గ్రేవ్ యార్డ్ (సిమెట్రీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంత్రి తన సొంత ఖర్చులతో వాటర్ బాటిల్స్, స్నాక్స్, జ్యూస్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరే టర్ హేమలత, గ్రేవ్ యార్డ్ ఇన్చార్జి యరాజ్, పద్మారావు నగర్ పార్టీ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, నాయకులు లక్ష్మీపతి, రాజు, మహేందర్గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, అంబిక, వెంకట్, అనిత, అమృత, నాగలక్ష్మి, కౌసల్య, లావణ్య, కుమార్ యాదవ్, సుధాకర్రెడ్డి, అబ్బాస్, పహీం, దేశపాక శ్రీను, ముక్కా శ్రీను, వెంకట్ పాల్గొన్నారు.