Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
రాష్ట్రంలో ఏడేండ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ కార్మికుల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు టి.వెంకట్ రాములు విమర్శించారు. మంగళవారం ఈసీఐఎల్ నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ కలకొండ కాంతయ్య అధ్యక్షతన జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం మూడో రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం సమావేశంలో వెంకట్ రాములు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించడంలో ప్రభు త్వాలు విఫలం చెందాయన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేదనీ, ప్రతి ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఎన్నో హమీలులు ఇచ్చి వాటిని అమలు పర్చలేదన్నారు. దళితులకు రూ.10 లక్షల దళితబంధు ఇస్తామని చెప్పి వారిని మభ్యపెట్టాలని అనుకుంటే ప్రజలు కేసీఆర్ ఎత్తుగడలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం మూడో రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 29, 30 తేదీల్లో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కీసరలో నిర్వహిస్తున్నామని వెంకట్ రాములు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కలకొండ కాంతయ్య, తాటికొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభల సందర్భంగా డిసెంబర్ 29న భారీ ప్రదర్శన, బహిరంగసభ ఉంటుందనీ, అదే రోజు సాయంత్రం ప్రతినిధుల మహాసభ ప్రారంభమై, ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్.బాల మల్లేష్ సమావేశ అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్.బాల మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా డీజీ సాయిలుగౌడ్, కోశాధికారిగా రొయ్యల కృష్ణమూర్తితో పాటు ప్యాట్రన్స్గా టి.వెంకట్ రాములు, వి.ఎస్. బోస్, ఉపాధ్యక్షులుగా కలకొండ కాంతయ్య, తాటి వెంకటేశ్వర్లు, సయ్యద్ అఫ్సర్, యూసుఫ్, ఏసు రత్నం, సీహెచ్ దశరథ్, దామోదర్రెడ్డి, శంకర్రావు, రాజేశ్వర్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా తోటపల్లి శంకర్, సహాయ కార్యదర్సులుగా జే.లక్ష్మి, ఉమ మహేష్, వెంకట్రెడ్డి, సత్యప్రసాద్, పుట్ట లక్ష్మణ్, వి.వెంకటచారి, ప్రజా నాట్యమండలి, ధర్మేంద్ర, కె.సహదేవ్, పీవీ రమణ, నిమ్మల నర్సింహులు, రామ్ నారాయణ, టి. యాదయ్యగౌడ్, జయచంద్ర, ఆర్గనైజింగ్ సహాయ కార్యదర్శిగా బి.కృష్ణ, వీబీ.బాలరాజు, కృష్ణ కూకట్పల్లి, రచ్చ కిషన్, ప్రమీల, విశాల్, నాగజ్యోతి, నర్సయ్య మాజీ కౌన్సిలర్, లక్ష్మినా రాయణ, ఎం.మార్టిన్, తదితరులు ఆహ్వాన సంఘంగా ఏర్పడ్డారు. ఈ ఆహ్వాన సంఘం మహాసభల జయప్రదం కోసం కృషి చేయాలని తీర్మాణించింది. అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.