Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ డివిజన్లోని మల్కాజిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ను వెంటనే విడుదల చేయాలనీ, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బ్యాగరి వెంకటేష్ మాట్లా డుతూ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక రోజు పేద, బడుగు, బలహీన విద్యార్థులకు ప్రయివేటు, కార్పొరేటు కళాశాలలో ఫీజు కట్టుకోవాలంటే భారంగా మారిందన్నారు. ప్రభుత్వం మాత్రం ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఫీజులను విపరీతంగా పెంచుకోండి అని చెప్పి పేద, బడుగు, బలహీన విద్యార్థులను చదువులకు దూరం చేసేటట్టుగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ కళాశాలను అభివృద్ధి చెయ్యండి అంటే ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడంలో నూతనంగా కేటాయిస్తుంది కానీ రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు అభివృద్ధి కోసం విడుదల చేసే దానికి ఆలోచన ఎందుకు చేయవద్దు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని పోరాటాలు చేస్తుంటే ఇప్పటివరకు భర్తీ చేయకపోవడం సిగ్గు చేటనీ, ఖాళీగా ఉన్న లక్షా 92 వేల ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనీ, రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్షిప్, పీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ వినీత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.