Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లాల్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల ముసా యిదా జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిం చింది. తుది జాబితాను ఈనెల 10వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే 15 జనవరి 2021 నుంచి 2021 నవంబర్ 1వరకు నమోదు చేసుకున్న ఓటర్లు 43,53,556 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 22,49,176 మంది, మహిళలు 21,04,145 మంది, ట్రాన్స్ జెండర్స్ 656 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 1616 ప్రాంతాల్లో 3,977 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
50 వేల ఓటర్ల పెరుగుదల
జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్తగా 50 వేల మంది ఓటర్లు పెరిగినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 15 జనవరి 2021 వరకు జిల్లా ఓటర్ల సంఖ్య 43,11,803 మంది ఉంటే పెరిగిన, తొలగించిన ఓటర్లతో 50,742 ఓటర్లతో 4353,556 మందికి చేరింది. దీంతోపాటు డబుల్ ఓటర్లు, చిరునా మా మారిన వారు, మరణంచిన వారు, ఇతర కారణాలతో 8,989 మంది ఓటర్లను అధికారు లు తొలగించారు. అయితే జిల్లా ఓటర్లకు సంబంధించిన ముసాయిదా జాబితా-2022ను విడుదల చేశారు. తుది జాబితాను ఈనెల 10న ప్రకటించనున్నారు. చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలో అత్యధికంగా 6,218 మంది ఓటర్లు, అత్యల్పంగా కంటోన్మెంట్ నియోజకవ ర్గంలో 1037 మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. యాకత్పురాలో 5,408, మలక్ పేట్లో 5,235, బహదూర్పురాలో 5,110, జూబ్లీహిల్స్లో 4,700 మంది ఓటర్లు పెరిగారు. దీంతోపాటు అత్యధికంగా గోషామహల్ నియోజకవర్గంలో 1312 మంది ఓటర్లను తొలగించారు. కంటోన్మెంట్లో అత్యల్పంగా 336 ఓటర్లను తొలగించారు.