Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320 లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తిరుమలనగర్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా లయన్ పూర్ణిమాదేవి, లయన్ మురళీ కృష్ణ సహకారంతో కరెంట్ సబ్ స్టేషన్ ఆఫీస్ దగ్గర ఎలక్ట్రిసిటీ కార్మికులకు హెలిమెంట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ 320 జిల్లా గవర్నర్ లయన్ ఆవుల గోపాలరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ వెంకటనారాయణ రెడ్డి, ఉదరు కుమార్, నాగ శేఖర్ రెడ్డి, ఉద్యోగుల సంఘాల నాయకులు వెంకన్నగౌడ్, సుభాష్, మెగా సర్వీస్ ఈవెంట్స్ లయన్ కృష్ణ ప్రసాద్, జోన్ చైర్ పర్సన్ లయన్ మురళీ చారి, క్లబ్ అధ్యక్షులు లయన్ సురేష్గౌడ్, సెక్రెటరీ రమేష్, కోశాధికారి మహేశ్వర్ రావు, మల్లేష్ గౌడ్, మురళీకృష్ణ, నవీన్ యాదవ్, చంద్రశేఖర్, స్వయం ప్రకాశ్ రామకృష్ణ, కుమార్, సాంబశివరావు, మూర్తిగౌడ్, క్లబ్ సభ్యులు , ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్, వర్కర్స్ పాల్గొన్నారు.