Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
నిరుపేదలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు 27 మందికి కల్యాణలక్ష్మి, ఏడుగురికి షాదీ ముబారక్ చెక్కులను మేయర్ మేకల కావ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పథకాలను అర్హులైన వారందరూ సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాప్రా తహశీల్దార్, జవహర్నగర్ రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.