Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సామాజిక సేవా కార్యక్రమాలు విస్త్రృతంగా చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న ఎన్ఆర్ఐ కోటేశ్వరరావుకు ఏషియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఈ మేరకు బుధవారం సోమాజి గూడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల క్రితం కతర్ దేశానికి వెళ్లి వ్యాపారుడి గా స్థిరపడి సొంత దేశానికి సేవ చేయాలనే తపనతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. తన సొంత గ్రామంలో బ్లడ్ బ్యాంక్, కులాలకు అతీతంగా అన్ని వర్గాలకు ఉపయోగపడేలా శ్మశాన వాటికను ఏర్పాటు చేశానని వెల్లడించారు. తాను చేసిన సేవా కార్యక్రమాలకుగాను గతంలో హిందూ రతన్ అవార్డుతోపాటు అనేక అవార్డులు వరించాయని తెలిపారు. తాజాగా డాక్టరేట్ రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందనీ, భవిష్యత్లో మరింత విస్త్రృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తానని పేర్కొన్నారు.