Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
దీపావళి పర్వదినాన్ని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలనీ, ఈ పండగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ హరీష్ ఆకాంక్షించారు. గురువారం దీపావళి పండగను పురస్కరించుకుని కలెక్టర్ జిల్లా ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు టపాసులు కాల్చే సందర్భంలో అవసరమైన జాగ్రత్తలు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు, అధికారులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.