Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఉపకమిషనర్ రాజు సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేర్లతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 6, 7, 27, 28 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించ నున్నట్టు తెలిపారు. మొత్తం 379 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితా ఉంటుందనీ, ప్రజలందరూ వారికి దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలని సూచించారు. అంతేకా కుండా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఏమైనా మార్పులు ఉంటే 30వ తేదీ లోపు సరిచేసుకోవాలని సూచించారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు-379, మొత్తం ఓటర్లు-4,53,038, పురుషులు-2,29,046, స్త్రీలు-2,23,976, ఇతరులు- 16. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ ఉపకమిషనర్ నాగమణి, మల్కాజిగిరి మండల తహసీల్దార్ వినయలత, అల్వాల్ మండల తహసీల్దార్ నాగమణి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సురేష్కుమార్, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.