Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ సర్కిల్ మేరు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా, దీపావళి ఆత్మీయ సమ్మేళనం తో పాటు మహా సభను విజయవంతం చేసేందుకుగాను మేరు సంఘం ప్రతినిధులు ముందుకు రావాలని సంఘం అల్వాల్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. అల్వాల్లో మేరు సంఘం జోన్ 11 సమావేశం అధ్యక్షులు రాపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన మహాసభను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. మేరు సంఘం శ్రేణులకు ఈ సందర్భంగా మహాసభ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. మేరు సంఘం అభివృద్ధిపై విభిన్న అంశాలను సభలో తీర్మానం చేయనున్నట్టు చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి దికొండ వెంకటేష్, కోశాధికారి గంధం కిషన్, ఉపాధ్యక్షులు రాపర్తి శివపాల్, రాష్ట్ర కార్యదర్శి బత్తుల కరణ్, తదితరులు పాల్గొన్నారు.