Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
చర్లపల్లి డివిజన్ పరిధిలోని సోనియాగాంధీ నగర్లో స్థానిక నాయకులతో కలిసి కాలనీలో కలియ తిరిగి శానిటేషన్, పరిశుభ్రత, స్ట్రీట్ లైట్స్ పనితీరు గురించి అడిగి తెలుసుకున్న కార్పోరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. ఈ సందర్భంగా కాలనీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కాలనీ వాసులు కోరడంతో త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోనియాగాంధీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ సంపత్, కనకయ్య, చెన్నయ, కుమార్, బాలరాజు, మహేందర్, ఈర్యనాయక్, డివిజన్ నాయకులు బాల్రెడ్డి, సాయినాథ్, రామచందర్, వెంకటచారి, రవి చంద్ర, ప్రభుగౌడ్, విద్యాసాగర్, కనకరాజు గౌడ్, శ్రీకాంత్ యాదవ్, రాజేశ్వర్రెడ్డి, జయకృష్ణ, కనకయ్య, తాండ్ర యాదగిరి, బాబు గంగపుత్ర, రాఘవరెడ్డి, శేఖర్, సురేష్, మల్లేష్, సాయి వంశీ పాల్గొన్నారు.