Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి చేపల పెంపకం ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ అన్నారు. బుధవారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడిపల్లి గ్రామ పరిధిలోని చెరువులో సుమారు 15 వేల చేప పిల్లలను వదిలారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రెండేండ్లుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండుకుండలా తలపిస్తున్నాయని తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం చేప పిల్లల పెంపకం చాలా లాభదాయకమైనదని, దీంతో వారున కొంత మేరకు ఆర్థిక బలోపేతం కావడానికి మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బింగి దాస్గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, కవాడిపల్లి సర్పంచ్ దూసరి సుజాత యాదయ్య, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, నాయకులు ఎల్లారెడ్డి, గిరి, భాస్కర్, గ్రామస్తులు, మత్స్యకారులు పాల్గొన్నారు.