Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రమాదవశాత్తు భవనం మీదనుంచి కిందపడిన వ్యక్తి మతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హకీంపేటలోని సనా హోటల్ సమీపంలో ఫలక్ ఫంక్షన్ హాల్లో బీహార్కు చెందిన రియాజ్ అలియాస్ గోరా(25) అనే వ్యక్తి గత 6 నెలలుగా పనిచేస్తున్నాడు. అయితే ఈనెల 3న రాత్రి మద్యం సేవించి జు ఫంక్షన్ హాల్లో నిద్రపోతానంటూ వచ్చాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత రియాజ్ ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి కిందపడి మతి చెందాడు. గురువారం దీన్ని గమనించిన స్థానికులు యజమాని మహ్మద్ అఖీల్కు తెలిపారు. ఈఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.