Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఇంటి నుంచి బయటకు వెళ్లిన గహిణి అదశ్యమైన ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాఘవేంద్ర తెలిపిన వివరాల మేరకు.. లాలాపేట్ శాంతినగర్ ప్రాంతానికి చెందిన అలోక్ కుమార్, శన్కుంతల శెట్టి లకు ఏడాది కిందట వివాహం జరిగింది. అయితే గత నెల 26న ఇంట్లో భార్యభర్తలకు చిన్న గొడవ జరిగింది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు భర్త అలోక్ కుమార్ పనికి వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఇంటికొచ్చే సరికి అతని భార్య శన్ కుంతల శెట్టి కనిపించకుండా పోయింది. దీంతో తెలిసిన వారిని, బంధువులను వాకబు చేసినా ఫలితం కనిపించకపోవడంతో బుధవారం రాత్రి స్థానిక లాలాగూడ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు తమ సమాచారాన్ని అందజేయలని ఎస్ఐ రాఘవేంద్ర కోరారు.