Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
పంజాగుట్టలో చిన్నారి అనుమానాస్పద మతి కేసుపై విచారణ కొనసాగుతోందని హైదరాబాద్ జాయింట్ సీపీ వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్నారి ఎవరు అనేది దర్యాప్తు కొనసాగుతుందని, 100 సీసీ కెమెరాలు పరిశీలించామన్నారు. చిన్నారి ఫోటోలు అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించి పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. చిన్నారి ఒంటిపై పాత గాయాలు ఉన్నాయని, కొత్తగా గాయాలు లేవని జాయింట్ సీపీ వివరించారు. చిన్నారిని ఎక్కడో హత్య చేసి పంజాగుట్టలో పడేసి ఉంటారని భావిస్తున్నామని, అన్ని పోలీస్ స్టేషన్ లో చిన్నారుల మిస్సింగ్ కేసులు పై కూడా ఆరా తీస్తున్నామన్నారు. చిన్నారి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరి కొన్ని విషయాలు బయట పడతాయన్నారు.