Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్పేట్
చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్ పేట్కు చెందిన బొమ్మని శివ కుమార్(30) భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది వరకు మీర్పేట్ మున్సిపల్ కార్యాలయంలో వాటర్మెన్గా విధులు నిర్వహించారు. మద్యానికి బానిసైన శివ కుమార్ వాటర్ మెన్ ఉద్యోగం మానేశాడు. దీంతో మద్యం తాగడం మానేసి ఏదైనా పని చేయాలని భార్య అతనికి పలుమార్లు చెప్పింది. రోజు మాదిరిగానే గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. గమనించిన భార్య, ఇతర చుట్టూ పక్కల వారు మందలించడంతో మనస్థాపానికి గురై అందరూ పడుకొని నిద్రపోయిన తర్వాత పెద్ద చెరువు పక్కన ఉన్న వారి పొలంలో చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించినట్లు సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ ఉదరు భాస్కర్ తెలిపారు.