Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
భార్యను హత్యచేసిన కేసులో భర్తకు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత కారాగార శిక్ష విధించారు. శుక్రవారం పీపీ టి.బాలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన కంచాల శ్రీనివాస్రావు మోయినాబాద్ పరిధిలోని ఏత్భార్ పల్లిలో నివాసముంటున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాస్ తరుచూ వేధింపులకు గురిచేసేవాడు. పెద్దలు సర్దిచెప్పినా అతనిలో మార్పు రాలేదు. 2019, నవంబర్ 17లో దంపతుల మధ్యం వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ తన భార్యను గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న మోయినాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అన్ని కోణాల్లో విచారించిన 14వ అదనపు జిల్లా న్యాయ స్థానం నిందితుడికి యావజీవ కారాగార శిక్ష విధించింది.