Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
గత మూడు దశాబ్దాలపైగా వికలాంగ బాల బాలికలు, అనాథ పిల్లలకు విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తున్న వంశీ వేగేశ్న సంస్థలను ప్రవాసాంధ్రులు సంస్థ ప్రాంగణాన్ని దర్శించి అభినందించారు. ఉగాండాలో స్థిరపడిన బూరుగుపల్లి వ్యాసకష్ణ ప్రాంగణంలో ఘంటసాలకు ప్రత్యేక ఆలయాన్ని నిర్మించటాన్ని చూసి వంశీ రామరాజును ప్రశంసించారు. ప్రముఖ రచయిత్రి, అంతర్జాతీయ కార్యక్రమాల వ్యాఖ్యాత రాధిక మంగి పూడి లోరియల్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సప్లై చైన్ డైరెక్టర్ సాయి ప్రకాష్ గురువారం వంశీ వేగేశ్న ఫౌండేషన్ ఆశ్రమానికి వచ్చి ఒకే ప్రదేశంలో విద్యా సంస్థలు, వైద్య సేవలతో పాటు ఆధ్యాత్మిక చింతన పెంచే విధంగా దేవాలయాలు ఉండటం అరుదైనదని కొనియాడారు. సంస్థకు తగు విధంగా సహాయ సహకారాలు ఆందిస్తామని తెలిపారు. వంశీ రామరాజుతో పాటు మెనేజింగ్ ట్రస్టీ శైలజ పాల్గొన్నారు.