Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా జల్పల్లి గ్రామానికి చెందిన షేక్ అప్జల్ నియమితులయ్యారు. ఈమేరకు శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను పేదలు చేరేలా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త తోడ్పాటు అందించాలని సూచించారు.