Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన సంఘటన కొత్తపేటలోని ఓజోన్ హాస్పిటల్లో జరిగింది. రంగారెడ్డి జిల్లా, మాడ్గుల మండల కేంద్రానికి చెందిన ఈదుల అంజనమ్మ(35), ఈదుల కృష్ణయ్య భార్యభర్తలు. రెండు నెలల కిందట వ్యవసాయ పనులు చేస్తుండగా అంజనమ్మ కాలుకు దెబ్బ తగిలింది. గాయానికి ఇన్ఫెక్షన్ సోకడంతో 47 రోజుల కిందట ఓజోన్ ఆస్పత్రిలో చేర్పించారు. అంజనమ్మ ట్రీట్మెంట్కోసం అప్పటి వరకు రూ. 13 లక్షల బిల్లు చెల్లించారు. శుక్రవారం డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు ముందే చెప్పారని, తీరా శుక్రవారం అంజనమ్మ చనిపోయిందని మృతురాలి బంధువులు వాపోయారు. రూ. 2 లక్షలు చెల్లిస్తేనే డెడ్బాడీ ఇస్తామని ఆస్పత్రి మేనేజ్మెంట్ చెప్పడంతో ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని, తమవద్ద వసూలు చేసిన రూ. 13 లక్షలకు రెట్టింపుగా తమకు చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.