Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బోడ సామెల్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ నియమించి, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవ్వాలన్నారు. బైరమల్ గూడాలో నివసిస్తున్న హోలియ దాసరి కుటుంబాలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. నవంబర్ 10న ఖమ్మంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు జి మనోహర్, సీఐటీయూ నాయకులు నర్సిరెడ్డి, ఆలేటి ఎల్లయ్య, వెంకన్న, ఎం వీరయ్య, మల్లేష్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.