Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
అమరవీరుల ఆశయాలను సాధిస్తాం అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరుశురాం అన్నారు. శుక్రవారం విద్యానగర్ చండ్రపుల్లారెడ్డి భవన్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడి కాయల పరశురామ్ హాజరై మాట్లాడుతూ 1975 నవంబర్ 3న జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, నీలం రామచంద్రయ్య లను చీకటి గుట్ట అడవిలో చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారు అని గుర్తు చేసుకున్నారు. జంపాల చంద్రశేఖర్ ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై అనేక పోరాటాలు చేశారని అన్నారు. ఆయన ఆశయాలు సాధించడానికి విద్యార్థులు ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి రియాజ్, నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శులు సుధాకర్, కీర్తి, భవాని, హరిణి, సాయి, చందన, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.