Authorization
Thu April 10, 2025 05:19:12 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కార్తీక మాసం సందర్భంగా శ్రీ చీర్యాల లక్ష్మీనసింహ స్వామి దేవస్థానంలో ఆదివారం సామూహిక శ్రీ సత్యనా రాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. నగరం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వా మివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిం చారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్, చైర్మెన్ మల్లారపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరి, భక్తులు పాల్గొన్నారు.