Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మండలంలో వివిధ కారణాలు, అనారోగ్యంతో మతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయంగా రూ. 5వేలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల మండలంలోని నూతన్కల్ గ్రామానికి చెందిన దొంగల రామచంద్రా రెడ్డి మృతి చెందడంతో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చిన్నోళ్ల భాస్కర్ మృతుని కుటుంబానికి రూ.5వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ సద్ది సురేష్రెడ్డి, వార్డు సభ్యుడు యూనిస్ పాష, గ్రామ నాయకులు చిన్నోళ జీవన్ కుమార్, మహేందర్ రెడ్డి, నర్సింగరావు, నవీన్, విప్లవ్ రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, రాజు రెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.