Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
పూడూరు గ్రామ పరిధిలోని కట్ట మైసమ్మ ఆలయాన్ని గ్రామస్తులు ఆది వారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో షెడ్డు నిర్మాణానికి గ్రామ స్తులు శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా నాయకులు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ భక్తులు సేదతీరడానికి, మొక్కులు చెల్లించుకోవడనికి వీలుగా దాతల సహకారంతో షెడ్డు నిర్మాణం చేపడుతున్నట్టుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాబు యాదవ్, ఎంపీటీసీ నీరుడి రఘు, సొసైటీ చైర్మెన్ సుధాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహరెడ్డి, నాయకులు ఆర్.మల్లారెడ్డి, సింగ రేణి పోచయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు డప్పు కృష్ణ, వార్డు సభ్యులు జనా ర్ధన్ యాదవ్, శశికుమార్, మానేపల్లి వెంకటేష్, శ్రీకాంత్, హన్మంతు రెడ్డి, గ్రామస్తులు జనార్థన్రెడ్డి, కోల వెంకటేష్, నిమ్మల కృష్ణ, తుపాకుల కృష్ణ, తులసి శ్రీనివాస్, గాదం రాములు, పరమేష్, బాలనందం, తదితరులు పాల్గొన్నారు.