Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
బాలానగర్ డివిజన్ రాజు కాలనీ పరిధిలోని షారోన్ మినిస్ట్రీస్ చర్చి వారి ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ కూకట్ పల్లి నియోజకవర్గం క్రిస్టియన్ మైనారిటీస్ విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్.వి రత్నం సంఘాన్ని సందర్శి ంచారు. ఈ సందర్బంగా వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన సంఘ పెద్దలు సన్మానించారు. ఈ సంద ర్భంగా రత్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుప రుస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి సంఘం సభ్యులకు వివరించారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కూలంకుషంగా వివరించారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతతో నియోజకవర్గ పరిధిలో ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించి బాధ్యతను మరింత పెంచార న్నారు. తనకు అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తూ పార్టీ పటిష్ఠతను పెంచుతూ కార్యక్రమాలు నిరవహించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందాలని ఆశించే వారు తనను సంప్రదించాలని కోరారు. సహకరించిన అందరికీ కృతజ్ఞ తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు వి.మాత్త్యూస్, సంఘ పాస్టర్ ఎమ్.రాజు, సంఘ సభ్యులు ఎమ్.బెంజిమెన్, మధులత, తదితరులు పాల్గొన్నారు.