Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఆవుల బాల్ నాదం శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం నేరేడ్మెట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఓల్డ్ నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్లో ఆదివారం ఆవులబాల్నాదం చిత్రపటానికి పూలమాలల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా నేరేడ్మెట్ బ్రాంచ్ అధ్యక్షులు పగిడిపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గంగాధరి కృష్ణ మాట్లాడుతూ ఐదు దశాబ్దాల పాటు దళితుల హక్కుల కోసం పోరాటం చేసిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఆవుల బాల్ నాదం 22 ఏండ్లపాటు ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. డాక్టర్ బాబా సాహేబ్ స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీలకు, రాజ్యాంగం ద్వారా కల్పించే ప్రాథమిక హక్కుల సాధనకు అనేక పోరాటాలు చేశారన్నారు. ముఖ్యంగా కారం చెడు, చుండూరు, లక్ష్మాపురం, మెదక్, అదిలాబాద్ ప్రాంతాల్లో దళితులపై జరిగిన ఘటనకు దళిత సంఘా లను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారని తెలి పారు. ఈ కార్యక్రమంలో గణేష్, జీఎం.రమేష్, ఏఏఎన్ శైలేష్, జే.శివకుమార్, జి.మహేష్ పాల్గొన్నారు.