Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్ డివిజన్ డీఏవీ స్కూల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను స్థానిక డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి సూచన మేరకు డివిజన్ నాయకులతో కలిసి సందర్శించినట్టు బీజేపీ అధ్యక్షులు ఓం ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వారి పేరును నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు కార్డులో తప్పులు, మార్పులు, చేర్పులు ఏమైనా ఉన్నా దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో బూత్ లెవల్ ఆఫీసర్లు సాయం చేయడం వల్ల స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలి పారు. ఈ నెల 27, 28 తేదీల్లో మళ్లీ జరుగుతుందనీ, ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఈ అవకాశాన్ని వినియో గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ కార్యదర్శి ఆర్ మణిరత్నం, ఉపాధ్యక్షులు సాయి సురేష్, ఓబీసీ మోర్చా డివిజన్ ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్, బిల్ కలెక్టర్ మనీష్, బీఎల్ఓలు వాణి, స్వప్న, శ్రీదేవి, పావని, జవాన్ శ్రీకాంత్, ఎస్ఎఫ్ఏలు, గోపాలకృష్ణ బాలమని, భాగ్యలక్ష్మి, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.