Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
టీఆర్ఎస్ మల్కాజిగిరి నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా పిట్ల నాగరాజు నియమితుల య్యారు. ఈ సందర్భంగా ఆనంద్బాగ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆయనకు నియామక పత్రాన్ని అంద జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయ కులు పని చేయాలని సూచించారు. పిట్ల నాగరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు, మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ అధ్యక్షులు పిట్ల శ్రీనివాస్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అర్హులైనవారందరికీ అందేలా తగిన కృషి చేస్తాననీ, నియోజవర్గంలోని యువత, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.