Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
బాలానగర్ డివిజన్ పరిధిలోని చెరబండరాజు కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్ను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో కమిటీ హాల్ భవనాన్ని సరికొత్త హంగులతో పనులు పూర్తి చేసిన సంద ర్భంగా ఆదివారం చెరబండరాజు కాలనీ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి హాజరై పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కమ్యూనిటీ హాళ్లు నిరుపేదలకు ఫంక్షన్ హాళ్లు వంటివనీ, అధికంగా నిరుపేదలు నివసించే బస్తీలో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్లో అన్ని వసతులు, హంగులు కల్పించడంలో ఎమ్మెల్యే కృష్ణారావు సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలి పారు. ఈ కార్యక్రమంలో బస్తీ అసోసియేషన్ అధ్యక్షులు కె.యాదగిరి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ సాగర్, టీఆర్ఎస్ చెరబండరాజు కాలనీ అధ్యక్షులు పి.యాదయ్య, టీఆర్ఎస్ బాలానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాజా, సీనియర్ నాయకులు దేవులపల్లి కృష్ణమూర్తి, స్థానిక నాయకులు శ్రీనివాసరావు, నర్రా దేవేందర్రెడ్డి, రంగంపెట్ శ్రీనివాస ముదిరాజ్, ప్రేమ్కుమార్, కందుల రమేష్, కాలనీ సభ్యులు పి.ప్రభాకర్, కె.ప్రసాద్, కుమార్, సింగారయ్య, పి.మధు, విష్ణు, ఓదెయ్య, టి.సంగయ్య, ప్రవీణ్ కుమార్, ధన్ రాజ్, కిష్టయ్య, హనుమంతు, బస్తీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.