Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
పోలీసు, ఎక్సైజ్ శాఖలు గంజాయి వినియోగ నివారణకు ప్రత్యేక డ్రైవ్లతోపాటు విస్తృత తనిఖీలు చేపడుతున్నా ఫలితం లేకుండా పోతుంది. కొంతమందిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఇంట్లోని పూలకుండీల్లోనే గంజాయి మొక్కలు పెంచడం మొదలు పెట్టారు. సికింద్రాబాద్ యాప్రాల్లో ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్న ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసి నింధితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఏడు పెద్ద కుండీల్లో గంజాయి మొక్కలను పెంచుతూ స్థానిక యువతకు విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నింధితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ తరహా ఘటనలు మరెక్కడైనా జరుగుతున్నాయో..? అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.